2
కీర్తన 
 
1 యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది?  
ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు?   
2 యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు,  
వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు, నాయకులు ఒకటిగా సమావేశం అవుతున్నారు.   
3 “దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం.  
మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు.   
   
 
4 కాని నా ప్రభువా, పరలోకంలో ఉన్న రాజు  
ఆ ప్రజలను చూచి నవ్వుతున్నాడు.   
5-6 దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు:  
“రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను.  
అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.”  
మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది.   
   
 
7 యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను.  
యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను!  
మరియు నీవు నా కుమారుడివి.   
8 నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను.  
భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు!   
9 ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు  
ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.”   
   
 
10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి.  
పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి.   
11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.   
12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి  
మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు.  
యెహోవాయందు విశ్వసం ఉంచేవారు సంతోషిస్తారు.  
కానీ ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.